నల్లగొండ జిల్లా ఆయిల్ పామ్ సొసైటీ ఆధ్వర్యంలో అద్దంకి రోడ్డు, నార్కెట్‌పల్లి-మిర్యాలగూడ రోడ్డు సమీపంలోని దుప్పలపల్లిలో వి. ప్రభాకర్ రెడ్డి ఆయిల్ పామ్ తోటలో రైతు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్‌ నుండి ఇన్నోవేటివ్ ఫార్మర్ సాంబారెడ్డి, నల్లగొండ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అనంతరెడ్డి, సొసైటీ అధ్యక్షులు ఆర్. గురువారెడ్డి, ప్రధాన కార్యదర్శి సిహెచ్. గురూజీ, వైస్ ప్రెసిడెంట్ వై. నర్సిరెడ్డి, మారం రామచంద్రారెడ్డి, జి. శ్రీధర్ రెడ్డి, రుద్రాక్షి దుర్గయ్యతో పాటు 20 మంది ఆయిల్ పామ్ రైతులు పాల్గొన్నారు.

సమావేశంలో సైంటిస్ట్ సాంబారెడ్డి మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగులో ఖర్చులను తగ్గించేందుకు ఫర్టిగేషన్ పద్ధతి అత్యంత ప్రయోజనకరమని తెలిపారు. ఈ పద్ధతి ద్వారా ఎరువుల వినియోగం, లేబర్, రవాణా ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని, ఫలితంగా రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చని వివరించారు. అలాగే, ఆయిల్ పామ్ సాగులో వివిధ రకాల ఎరువుల వాడకంతో వచ్చే సమస్యలను నిరంతరం సమీక్షించి, సమర్థవంతంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అనంతరెడ్డి, రైతులు ఆధునిక సాంకేతికతలను అవలంబించి, సాగు వ్యయాలను తగ్గించుకునే విధంగా చర్యలు చేపట్టాలని సలహా ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్న రైతులు తమ సాగు అనుభవాలను, సవాళ్లను పంచుకుని, సాంబారెడ్డి సూచనలను స్వాగతించారు.

ఈ సమావేశం ఆయిల్ పామ్ రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు, ఖర్చులు తగ్గించి లాభాలను పెంచే దిశగా మార్గనిర్దేశం చేసింది.

 

 

BREAKING NOW APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKING NOW
BREAKING NOW

 

 

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *