హైద‌రాబాద్: (జూలై 25, 2024): జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 32 లో  హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేతుల మీదుగా జరివరం శారీస్ స్టోర్ ఘ‌నంగా ప్రారంభమైంది. మేయర్ తో పాటు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి, యువ నటుడు రక్షిత్ అట్లూరి పాల్గొని నిర్వాహకులకు అభినందలు, శుభాకాంక్ష‌లు తెలిపారు.

అభిలాష రెడ్డి, గాయత్రి (నటుడు కృష్ణుడు వైఫ్) ఇద్దరూ కలసి ఎంతో ఫ్యాషన్ తో ఈ జరివరం స్టోర్ ప్రారంభించారు. ఇక్కడ అన్ని రకాల కలెక్షన్స్ తో పాటు కంచి పట్టు, ఆర్గంజా, బ్రైడల్ డిజైన్ తో కష్టమైజెషన్ కూడా ఉంటుంది. ఈ జరివరం వన్ స్టాప్ షాప్‌లా ఉంటుంది అని తెలియజేశారు. అంతే కాకుండా కంచి పట్టు త‌మ‌ జరివరం ప్రత్యేకత అని తెలిపారు. పెళ్లిళ్లకు స్టార్ట్ టూ ఎండ్ వరకూ మా దగ్గర షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పారు అభిలాష రెడ్డి, గాయత్రి.

ఈ సంద‌ర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఇక్కడ కలెక్షన్స్ చూస్తే చాలా బాగున్నాయి.. లేడీస్ అందరూ ఈ స్టోర్ కి రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ తృతీయ జ్యూవ‌ల‌రీస్ స్టాల్ లోపల పెట్టారు. ఆ కలెక్షన్స్ కూడా బాగున్నాయి. మ్యారేజ్ డ్రెస్ లే కాకుండా ఫాన్సీ డ్రెస్సులు కూడా బాగున్నాయి. ఇక్కడే వీవింగ్ చేసి కస్టమర్స్ టేస్ట్ కు తగ్గట్టుగా కష్ట మైజెషన్ చేసి వీళ్ళు ఇస్తున్నారు. వీళ్ళ కలెక్షన్స్ నాకు చాలా నచ్చాయి అని తెలిపారు.

శ్యామలా దేవి మాట్లాడుతూ… జరివరం స్టోర్ కు నన్ను గెస్టుగా ఆహ్వానించడం హ్యాపీ గా ఉంది. ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. మరీ ముఖ్యంగా కంచి పట్టు చీరల వెరైటీలు ఉన్నాయి. నాకు పర్సనల్ గా కంచి పట్టు అంటేనే ఇష్టం. ఇప్పుడు నేను వేసుకునేది కూడా కంచి పట్టునే.. కృష్ణంరాజు నాకు కొన్న ఫస్ట్ కంచి పట్టు చీర ఇది అని చెప్పారు. అంతేకాకుండా ప్రభాస్ పెళ్ళి బట్టలు కూడా ఈ జరివరం నుండే కొంటాము అని చెప్పారు. అలాగే ఎంతో ఫ్యాషన్ ఎక్కడ.. ఎక్కడ నుండో మంచి కలెక్షన్స్ తెప్పించిన ఇంత అందంగా జరివరం స్టోర్ స్టార్ట్ చేసిన అభిలాష రెడ్డికి, గాయిత్రికి అభినందనలు తెలిపారు.

రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ… జరివరం స్టోర్ ఓపెనింగ్ కు రావడం చాలా హ్యాపీ గా ఉంది.. ఇక్కడ చీరల కలెక్షన్స్ చాలా యూనిక్ గా ఉన్నాయి. వైవిద్యం కోరుకొనే మహిళలకు ఈ జరివరం కలెక్షన్స్ తప్పకుండా నచ్చుతాయి అని తెలిపారు.

నటుడు కృష్ణుడు మాట్లాడుతూ.. అభిలాష రెడ్డి, మా వైఫ్ గాయత్రి కలసి ఈ స్టార్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఈ కలెక్షన్స్ కోసం చాలా కష్టపడ్డారు. హైదరాబాద్ లో ఉండే అతివలకు బెస్ట్ కలెక్షన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ జరివరం స్టార్ట్ చేసారు. అతిధులుగా వచ్చిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి, శ్యామలా దేవికి, నటులు రక్షిత్ అట్లూరికి.. ఇంకా వాళ్ళను అభినందించడానికి వచ్చిన అందరికీ కృజ్ఞతలు తెలిపారు.

అభిలాష రెడ్డి, గాయత్రి మాట్లాడుతూ… మా ఆహ్వానం మన్నించి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ఈ స్టోర్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం. కస్టమర్స్ కి ది బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా నెలల నుండి హామ్ వర్క్ చేసి ఈ జరివరం స్టార్ట్ చేశాం. మా దగ్గర అల్ టైప్స్ ఆఫ్ శారీస్ తో పాటు కంచి పట్టు మా ప్రత్యేకత తీసుకున్నాము. వన్ స్టాప్ షాప్ లా ఈ జరివరం ఉంటుంది. మా జరివరం పేరులో ఎంత నిజాయితీ ఉందో మా కలెక్షన్స్‌లో కూడా అదే చూపించబోతున్నాం. మీరు ఒక్కసారి మా జరివరంకు వస్తే ఇది కరెక్ట్ అని మీరే చెబుతారు అని తెలిపారు.

By admin