సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని ఖండాంత‌రాల్లోని ఎన్నారైలు స్వాగ‌తించారు. 52 దేశాల ఎన్నారైలు మద్దతిచ్చారు. బీఆర్ఎస్ ఎన్నారై సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు మహేష్ బిగాల. అన్ని దేశాల ఎన్నారై ప్రతినిధులు ముక్తకంఠంతో బీఆర్ఎస్ కు మద్దతు పలికారు. ఈ సంద‌ర్భంగా మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో ఎన్నారైల మద్దతు ప్రకటించారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వం అవసరం ఉందని అందరు ఎన్నారైలు బీఆర్ఎస్ ను ముక్తకంఠంతో స్వాగతించారని తెలిపారు మహేష్. కేసీఆర్‌ తోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో జాతీయ పార్టీ దేశ భవిష్యత్‌ను మార్చబోతుందన్నారు.

బీజేపీ ముక్త్‌ భారత్‌ నినాదంతో కేసీఆర్‌ అడుగుజాడల్లో ముందుకెళ్తామన్నారు. ప్రపంచదేశాల్లో ఉన్న ఎన్నారైలందరినీ ఏకం చేస్తామని, జాతీయ పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు. విదేశాల్లో ఉన్న వారందరికీ తెలంగాణ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో వివరించి, మద్దతు కూడగడుతామన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా మారిందని, రాష్టాన్ని అగ్రగామిగా నిలిపిన కేసీఆర్‌ దేశానికి అవసరమని ప్రజలంతా భావిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో ప‌లు దేశాల్లోని ఎన్నారై బీఆర్ఎస్ సెల్ నాయ‌కులు, టీఎస్ఎఫ్‌డీసీ చైర్మ‌న్ అనిల్ కూర్మాచ‌లం త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *