▪️ మ‌రోసారి మాన‌వ‌త్వం నిరూపించుకున్న ‘మనం సైతం’
▪️ కాదంబరి కిరణ్ ఫౌండేషన్ ద్వారా ప‌లువురికి చెక్కులు పంపిణి
▪️ గడిచిన ద‌శాబ్ద‌కాలంగా ‘మనం సైతం’ సేవ‌లు

పేద‌వారికి సాయం ప‌డాల‌న్న సంక‌ల్పం.. నిస్సాహ‌య‌కుల‌కు అండ‌గా నిల‌బ‌డాల‌న్న మాన‌వ‌త్వం.. మొత్తంగా స‌మాజంలో అంద‌రూ బాగుండాల‌నే ల‌క్ష్యం.. వీట‌న్నింటికి ప్ర‌తిరూపమే.. ‘మనం సైతం’. గడిచిన పది సంవత్సరాల కాలంలో ఎంతో మందికి సాయం చేస్తోంది కాదంబరి కిరణ్ నిర్వ‌హ‌ణ‌లోని ‘మనం సైతం’ ఫౌండేష‌న్. ఈ సంద‌ర్భంగా కాదంబరి కిరణ్ ఫౌండేషన్ సారధ్యంలో ఆరుగురికి నిర్మాత దిల్ రాజు, దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా చెక్కులు పంపిణి చేశారు. త‌మ సాయం నిరంత‌రంగా కొన‌సాగుతూనే వుంటుంద‌ని తెలిపారు.

ఫిల్మ్ చాంబర్ వేదికగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో కాదంబరి కిరణ్ మాట్లాడుతూ… ‘మనం సైతం’ ఫౌండేషన్ ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి నేటి వరకు అండగా ఉంటున్న కళామాతల్లి ముద్దుబిడ్డలైన ప్రతిఒక్కరికి పాదాబివందనం. గ‌డిచిన‌ పది సంవత్సరాల కాలంలో పేదలైన సినీ కార్మికులకు కోటి రూపాయాలకు పైగా సహాయం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి , ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారికి కృతజ్ఙతలు తెలిపారు. గడిచిన పది సంవత్సరాల కాలం నుంచి తెలుగు రాష్ట్రాలలో ఉన్న పేదల నుంచి విజ్ఞ‌ప్తులు అందుతుండటంతో సాధ్య‌మైనంత సహాయం చేస్తున్నాం, అంతేకాకుండా ప్రకృతి వైపరిత్యాలైన తిత్లీ తూఫాన్, కర్నూలు వరదలు, కేరళ వరదల సమయంలో అందరి సహాకారంతో సహాయం చేశాము. వందలాది మంది సాయం కోసం ఎదురుచూపు..కానీ ‘మనం సైతం’ సేవలు తీసుకునే వారికి తొందరగా చేరుకున్నా.. దాత‌ల ద‌గ్గ‌రికి అంత తొందరగా చేరడం లేదని నా భావన.. ఇది తెలుసుకున్న ఇండస్ట్రీ పెద్దలు ప్రసన్న కుమార్ గారు, చదలవాడ శ్రీనివాసరావు గారు, దాము గారు, వివి వినాయక్ గారు, జయసుధ గారు తమ సహాకారం ఉంటుందని ప్రోత్సాహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా వచ్చిన దిల్ రాజు, దాము, ప్రసన్న కుమార్ పలువురు ప్రముఖుల చేతుల మీదుగా అవసరార్ధులకు రూ. 25 వేలు చొప్పన చెక్కుల పంపిణి అందజేయడం ఆనందగా ఉంది” అని అన్నారు.

ముఖ్య అతిథి దిల్ రాజు మాట్లాడుతూ.. ”దేవుడు ఉన్నాడా..? లేడా.? చర్చ రెగ్యూలర్ గా వింటూ ఉంటాం.. అది మనుషులకైతే తెలియదు.. నమ్మేవాళ్లు నమ్ముతారు… నమ్మని వాళ్లు నమ్మరు. దేవుడు మనిషి పుట్టించాడు… ఆ మనిషి ద్వారా ఎదుటి మనిషికి సాయం పొందినప్పుడే దేవుడున్నాడని నమ్ముతుంటారు.. ‘మనం సైతం’ సేవ కార్యక్రమాలు చూస్తుంటే దేవుడికి, మనిషికి కాదంబరి కిరణ్ ఓ వారధి, ఇలాంటి చూసినప్పుడు దేవుడు ఉన్నాడని బలంగా అనిపిస్తుంది. సినీ ఇండస్ట్రీలో పెద్దలు, స్నేహితుల సహాకారంతో ఇప్పటివరకు చాలా సేవలు చేశారు. మీ చివరి శ్వాస వరకు ఈ సేవలు కొనసాగించండి.. మీ వెనుక మేము ఉంటాం. దైవం మానవ రూపంలో అవతరించు నీలోకంలో.. అదే కాదంబరి కిరణ్” అన్నారు.

నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ”ప్రతి ఒక్కరికి సాయం చెయ్యాలని ఉంటుంది.. దానికి వెనుక మరో లక్ష్యం ఉంటుంది. అలాంటిది ఏమైనా ఉందా అని పదేళ్ల క్రితం నా దగ్గరికి వచ్చిన కాదంబరి కిరణ్ అడిగాను. అలాంటిది ఏం లేదు అన్నాడు. తొమ్మిదేళ్లుగా గమనిస్తున్నాను. అ రోజు ఏదైతే చెప్పాడో అదే లక్ష్యం తో పనిచేస్తున్నారు. సహాయం చెయ్యాలని చాలా మందికి ఉంటుంది.. వారికి దగ్గరివెళ్లి డబ్బు తెచ్చి… అవసరార్ధులకు ఇవ్వడం చాలా గొప్ప విషయం… ఇది అంతా సులువు కాదు.. కాదంబరి పౌండేషన్ ద్వారా ఓ ఓల్డేజ్ హోం కట్టాలని అనుకుంటున్నారు.. అది నేరవేరాలని… ఆయనకు మా సహాకారం ఎప్పుడు ఉంటుంది” అన్నారు.

నిర్మాత మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ… ”సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్నారు నందమూరి తారకరామారావు.. ప్రార్ధించే పెదవుల కన్నా.. సాయం చేతులు మిన్నా అన్నారు మదర్‌ ధెరిస్సా.. అదే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.. కాదంబరి కిరణ్ గారు.. కరోనా సమయంలో వేలమందికి సాయం చేశాడు. ఆయన సేవలను గుర్తించి చాలా మంది సినీ పెద్దలు కాదంబరికి అండగా నిలిచారు.. వృద్దాశ్రమం కట్టాలనే కొరిక నేరవేరాలని కోరుకుంటున్నాను” అని అన్నారు…

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ”కరోనా సమయంలో వివి వినాయక్ గారు తనవంతు బాధ్యతగా సాయం చెయ్యాలనుకున్నప్పుడు.. కాదంబరి కిరణ్ అయితేనే నిజాయితీగా చెయ్యగలడని భావించి 5 లక్షలు చెక్కు ఇచ్చారు.. అది ఆయన అంతే బాధ్యతతో అవసరార్ధులకు అందజేశారు… కాదంబరి కిరణ్ సేవ కార్యక్రమాలు మరింత మందికి చేరాలని కోరుకుంటున్నాను” అని అన్నారు..

వీరితో పాటు దర్శకులు చంద్ర మహేష్, ప్రేమ్ రాజ్, మహనంద్ రెడ్డి, సాంబశివరావు, బందర్ బాబీ, మనం సైతం సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గోన్నారు.

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

 

By admin