22 April 2025, భారత ప్రధాని మోదీ సౌదీ పర్యటన సందర్భంగా తెలుగు ఎన్నారైలు ఆయనతో సమావేశమయ్యారు.

ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనలలో భాగంగా విధిగా ప్రవాసీ ప్రముఖులను కలుస్తుంటారు. ఇటీవల తన సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ తెలుగు ప్రవాసీయులతో సమావేశమై యోగక్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు.

 

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలుగు రాష్ట్రాల బృందానికి నాయకత్వం వహించిన జెద్ధా నగరంలోని తెలుగు ప్రవాసీ మహిళ నాయకురాలు, Jeddah Telugu Mitrulu( JTM) President గాలి దుర్గా భవానీ ప్రధానితో మాట్లాడారు. మోదీ ప్రధాని అయినందుకు తమకు సంతోషంగా ఉందని, మీరు ప్రధాన మంత్రి అయ్యాక విదేశాలలో భారతీయుల ప్రాముఖ్యత పెరిగినది అని బాపట్ల జిల్లా మండలం పిట్టలవానిపాలెం మండల కేంద్రానికి చెందిన గాలి దుర్గా భవానీ వ్యాఖ్యానించగా, తానేమి నేరుగా ప్రధాని కాలేదని, మీరంతా కలిసి నన్ను ప్రధానిగా ఎన్నుకున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇందుకు వారందరికీ కృతజ్ఞతలని వ్యాఖ్యనించారు.

 

ప్రధానిని కలిసిన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిలో పాస్టర్ హానూక్ అభినయ్ (కర్నూలు), దీపక్ సాగర్ (హైదరాబాద్), రామరావు (గుంటూరు), దుర్గా భవానీ గాలి (బాపట్ల) , శాంతి వంక (హైదరాబాద్), రజనీ శ్రీహరి (తెనాలి), కిషోర్ వికటకవి (విశాఖపట్టణం), డాక్టర్ ఫుర్ఖాన్ తారిఖ్ (హైదరాబాద్), వాసే (హైదరాబాద్), ఇర్ఫాన్ అల్లాఉద్దీన్ (హైదరాబాద్), మీర్ ఘజన్ఫర్ జకీ (హైదరాబాద్), అమిత్ వంకా (హైదరాబాద్), కోటి శివ రామ కృష్ణ పడమట, (ఉలవలపూడి, కృష్ణ జిల్లా), సాగర్ కుంట (హైదరాబాద్), రఫీక్ బందుబాయి(కడప), బాలు విశ్వేశ్వర రావు(కట్టవారిపల్లి,AP), వెంకట్ సొడగం (హైదరాబాద్) , మస్తాన్ శేఖ్ (నర్సరావుపేట), షబ్బీర్ అలీ (విశాఖపట్టణం), మిర్జా ఖుద్రత్‌లు (హైదరాబాద్), మేనకా నాయుడు(కరీంనగర్) ఉన్నారు.

 

అంతకు ముందు, ప్రధానికి స్వాగతం పలికిన వారిలోనూ ముందు వరుసలో తెలుగు ప్రవాసీయులు ఉన్నారు. రంజీత్ చిట్లూరి (చిత్తూరు జిల్లా) గడ్డం శిల్పా (ప్రకాశం జిల్లా) సుచరిత (సికింద్రాబాద్) నాగార్జున (హైదరాబాద్) శాంతి (పాలకొల్లు) అమిత ఆనందోత్సాహాల మధ్య ప్రధానికి స్వాగతం పలికారు.

IISJ స్కూల్ తరుపున అభిలాష్ కందుకూరి (విశాఖ పట్నం), స్వాగత నృత్యంలో సాత్విక బుల్ నందలూరు (తిరుపతి) కూడా పాల్గొన్నారు.

వీరితో సమావేశమైన అనంతరం జరిగిన అధికారిక కార్యక్రమాలలో ప్రధాని పాల్గొన్నారు.

 

 

BREAKING NOW APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKING NOW
BREAKING NOW

 

 

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

  

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *