హైద‌రాబాద్: 2020 ఏడాదికి గాను 68వ జాతీయ సినిమా అవార్డుల‌ను కేంద్రం ప్రభుత్వం ప్ర‌క‌టించింది. జాతీయ ఉత్త‌మ తెలుగు చిత్రంగా ఎంపికైన క‌ల‌ర్ ఫొటో చిత్ర బృందానికి తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్‌ అనిల్ కుర్మాచ‌లం శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు సినిమా నుండి వివిధ విభాగాల్లో జాతీయ అవార్డులకు ఎంపికైన జాతీయ ఉత్త‌మ సంగీత దర్శకుడు విభాగంలో ఎస్ థ‌మ‌న్ (అల వైకుంఠ‌పురంలో)కు ,ఉత్త‌మ కొరియోగ్ర‌ఫీ విభాగంలో సంధ్యారాజు (నాట్యం)కు, బెస్ట్ మేక‌ప్ విభాగంలో టీవీ రాంబాబు (నాట్యం) లకు కూడా అనిల్ కుర్మాచ‌లం శుభాకాంక్షలు తెలిపారు.

By admin