లండన్ ఇఫ్తార్ విందులో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ నాయకుల స్పష్టీకరణ
దేశంలోని మైనారిటీలంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్న ముస్లిం నాయకులు

లండన్: రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఎన్నారై టీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్ లో ముస్లింలకు ఇఫ్తార్ విందు కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ – యూకే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో తెలంగాణ‌తో పాటు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ సెల్ – యూకే అధ్యక్షులు అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. ముస్లిం, హిందువుల మత సామరస్యానికి రంజాన్ దీక్షలు ప్రతీక అని అన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు రాజకీయంగా సామాజికంగా అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు, డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్సీలుగా, ఉప కులపతులుగా, కార్పొరేషన్‌ ఛైర్మన్లుగా, డిప్యూటీ మేయర్లుగా ఇలా ఎన్నో ఉన్నతమైన పదవులనిచ్చి, మైనారిటీ ల పట్ల ప్రత్యేక శ్రద్ధతో మన ప్రభుత్వం పని చేస్తుందని, మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ సంద‌ర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

టాక్ అధ్యక్షుడు – ఎన్నారై టీఆర్ఎస్ సెల్ – యుకే ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ, మైనారిటీల సంక్షేమం విషయంలో దేశంలోని ప్రతి రాష్ట్రం తెలంగాణ వైపు చూస్తున్నదని, ప్రత్యేకించి పేద మైనారిటీ పిల్లలకు నాణ్యమైన విద్యను ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఇటీవల ప్లీనరీ సమావేశంలో దేశ ప్రజల సంక్షేమం కోసం పని చేసే దిశగా ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన దిశా నిర్దేశాన్ని మైనారిటీ సోదరులకు వివరించారు, బాధ్యత గల భారతీయులుగా మనమంతా కెసిఆర్  వెంటే ఉండి, తెలంగాణ అభివృద్ధిని ఇక భారత దేశం నలువైపులా జరిగేలా కృషి చెయ్యాలని కోరారు. మైనారిటీల సంక్షేమం కేవలం కెసిఆర్ వల్లే సాధ్యమని తెలిపారు.

ఈ సంధర్భంగా హాజరైన ముస్లిం నాయకుడు సయీద్ ఇఫ్తార్ విందు అనంతరం మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం క్రమంగా తప్పకుండ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తూ సమాజానికి ఆదర్శనంగా నిలుస్తున్న ఎన్నారై టి. ఆర్. యస్ సెల్ ని అభినందించి, కెసిఆర్ నాయకత్వంలో ముస్లింలు ఎంతో ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారని, ప్రజలంతా సుఖ శాంతులతో , ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఆరోగ్యంగా ఉండి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని అల్లాని ప్రార్థించామని, మత సామరస్యానికి ప్రతీక ఐన రంజాన్ పండుగ ఉపవాస కార్యక్రమాలు ఎంతో పవిత్రమైనవన్నారు.

ముస్లిం నాయకులు మాట్లాడుతూ కెసిఆర్  నాయకత్వంలోనే మైనారిటీల సంక్షేమం జరుగుతుందని, మనమంతా కెసిఆర్  నాయకత్వాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల సంస్థల ముస్లిం నాయకులు మాట్లాడుతూ దేశం మొత్తం కెసిఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటుందని ముఖ్యంగా మైనారిటీ సమాజం తెలంగాణాలో అన్ని వర్గాల ప్రజలకు జరుగుతున్న సంక్షేమం గురించి చర్చిస్తున్నారని, రానున్న రోజుల్లో దేశ ప్రజలు కెసిఆర్ వెంట నడిచే సమయం వస్తుందని తెలిపారు.

ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం, అలాగే కెసిఆర్ గారు ముస్లింల అభివృద్ధికి తీసుకుంటున్న కార్యక్రమాలను వివరించారు. ముస్లింలకు మంచి జరుగుతుందంటే ప్రభుత్వం ఏం చేయడానికైనా సిద్ధమేనని తెలిపారు. టాక్ అడ్వైసరి చైర్మన్ మట్టా రెడ్డి, మాట్లాడుతూ ఇలాంటి పర్వదినాల సందర్భంగా మతసామరస్యం పెంపొందుతుందని చెప్పారు. ముస్లింలు అత్యంత నియమ నిష్ఠలతో రంజాన్‌ను జరుపుకొంటారని చెప్పారు. లండన్ ఇంచార్జ్ నవీన్ భువనగిరి మాట్లాడుతూ భారత దేశంలో ఎక్కడ లేని గంగ జామున తహజీబ్ మన తెలంగాణ కే సొంతమని, ప్రజలంతా అన్నదమ్ములా కలిసి ఉంటారని, అది దేశానికే ఆదర్శమని చెప్పారు. సంయుక్త కార్యదర్శి రమేష్ ఇస్సంపల్లి మాట్లాడుతూ భిన్నత్వంలో… ఏకత్వంలా హిందూ-ముస్లిం వర్గాలవారు కలసిమెలిసి, రంజాన్ జరుపుకోవడం మతసామరస్యానికి నిదర్శనమన్నారు

కార్యక్రమంలో అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, ప్రదాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, సంయుక్త కార్యదర్శులు మల్లా రెడ్డి, రమేష్ ఇస్సంపల్లి అధికార ప్రతినిధులు రవి కుమార్ రేతినేని, రవి ప్రదీప్ పులుసు, లండన్ ఇంచార్జి నవీన్ భువనగిరి నవీన్ మాదిరెడ్డి, ఈస్ట్ లండన్ ఇంచార్జి ప్రశాంత్ కటికనేని, మధు ఆబోతు, ప్రవాస తెలంగాణ వాదులు మట్టా రెడ్డి, గణేష్, నవాజ్, మసూద్, షరీఫ్, షా సాబ్, ఆదిల్, ఫయాజ్, ఫైసల్ ఖాన్ హాజరైన వారిలో వున్నారు.

By admin