హైదరాబాద్‌: ఉపాధి కోసం విదేశాలకు.. ముఖ్యంగా గల్ఫ్, మలేసియా లాంటి 18 ఈసీఆర్ దేశాలకు వలస వెళ్లే కార్మికుల కోసం హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రవాసి సహాయతా కేంద్రం మైగ్రంట్స్ హెల్ప్ డెస్క్) ను ప్రారంభించారు.

ఎయిర్‌పోర్టు నిర్వహిస్తోన్న జీఎంఆర్‌, తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టామ్‌కామ్‌) లు సంయుక్తంగా ఈ హెల్ప్‌డెస్క్‌ని ఏర్పాటు చేశాయి. తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రాణి కుముదిని ఈ హెల్ప్‌ డెస్క్‌ను ప్రారంభించారు. టాంకాం అధికారి నాగభారతి, ఎన్నారై అధికారి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. అమెరికా వెళుతున్న విద్యార్థి బేతి యశ్వంత్ రెడ్డితో కలిసి వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి సాయంత్రం ఎయిర్ పోర్టులోని ఇంటర్నేషనల్ డిపార్చర్స్ వద్ద ఉన్న ఈ హెల్ప్ డెస్క్ ను సందర్శించారు. టాంకాం అధికారి నాగభారతి, హెల్ప్ డెస్క్ ఇంచార్జి ఫణి కుమార్ లను ఈ సందర్బంగా అభినందించారు.

By admin