న్యూఢిల్లీ: పెట్రోల్‌ ధరల విషయంలో అసంతృప్తితో ఉన్న వాహనదారులకు తీపికబురు అందించింది కేంద్రం. పెట్రో ధరలపై భారీ ఊరట ఇచ్చే ప్రకటన చేసింది. ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు శనివారం సాయంత్రం వెల్లడించింది. పెట్రోల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ 8 రూపాయలు, డీజిల్‌ పై రూ. 6 తగ్గిస్తున్నట్లు తెలిపింది. తద్వారా పెట్రోల్‌ పై లీటర్‌కు రూ. 9.5, డీజిల్‌పై రూ.7 తగ్గుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు.

గ్యాస్‌ సిలిండర్‌పై రూ. 200 సబ్సిడీ
పీఎం ఉజ్వల్‌ యోజన కింద గ్యాస్‌ కనెక్షన్లు తీసుకున్న వారికి మాత్రమే రూ. 200 సబ్సిడీ వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.అదీ ఏడాదికి 12 సిలిండర్ల వరకు సబ్సిడీ వర్తిస్తుందని తెలిపింది. ఇదిలా ఉండగా.. దేశంలో ఉ‍జ్వల పథకం కింద.. 9 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి.

By admin