హైదరాబాద్ (మీడియాబాస్ నెట్వర్క్): ఎస్సీ 57 ఉపకులాలను Aవర్గంలో చేర్చుతూ ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 12న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి ప్రకటించారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉపకులాల ప్రజలు దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్నారని అందుకు ఎస్సీ వర్గీకరణనే పరిష్కారమని ఆయన అన్నారు. ఈ రాష్ట్రంలో 22 లక్షల జనాభా కలిగి ఎస్సీలలో 34% ఉన్న దళితులలో అట్టడుగు వర్గాలైన 57 ఉపకులాల ప్రజలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంతకాలం ఎస్సీ వర్గీకరణను మాల మాదిగల పంచాయతీగా చిత్రీకరించి రాజ్యాంగబద్ధంగా దళితులకు అందే అవకాశాలను ఈ రెండు కులాల వారే దక్కించుకున్నారన్నారు మిగిలిన అత్యంత వెనుకబడిన ఎస్సి ఉపకులాలు తీవ్ర అన్యానికి గురయ్యారని, ఉమ్మడి రాష్ట్రంలో 2000-2004 సంవత్సరం వరకు అమలు జరిగిన ఎస్సీ వర్గీకరణ వల్ల ఈ రెండు కులాలే లబ్ధి పొందినట్లు అనేక నివేదికలు తెలియ జేస్తున్నాయన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ఎస్సీ 57ఉపకులాలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, ఉపాధి పరంగా ఎలాంటి లబ్ధి జరగలేదని, కనీసం కుల ధృవీకరణ పత్రాలను పొందడంలో కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఆవేదన వ్యక్తంచేశారు.
ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎస్సీ/ ఎస్టీ కమిషన్ తదితర నామినేటెడ్ పదవులలో ఎస్సీ ఉపకులాలకు ఎక్కడ అవకాశం కల్పించలేదు అన్నారు. రుణాల పొందడంలో తీవ్ర అన్యాయానికి గురవుతున్నందువల్ల దశాబ్ద కాలంగాఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎస్సీ/ఎస్టీ కమిషన్ తదితర నామినేటెడ్ పదవులలో కూడా ఇంత వరకు ఎస్సీ ఉపకులాలకు ఎక్కడ అవకాశం కల్పించలేదు అన్నారు.
కార్పొరేషన్ రుణాలు పొందడంలో తీవ్ర అన్యాయానికి గురవుతున్నందువల్ల దశాబ్ద కాలంగా ఎస్సీఉపకులాలకు 2000కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా “దళితబంధు” పథకాన్ని రాష్ట్రప్రభుత్వం తీసుకొస్తే ఇందులో కూడా దళితులలో అత్యంత వెనుకబడిన ఎస్సిఉపకులాలకు చెందిన ప్రజలకు ఎక్కడా లబ్ది జరగలేదన్నారు. అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమాన్ని పాటుపడుతామని పదేపదే ఉపన్యాసాలు ఇచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్లకు వారి కార్యాలయాలలో ఎన్నిసార్లు వినతులు ఇచ్చినప్పటికి మా కులాల సమస్యలను విన్నవించుకోవడానికి అవకాశం కల్పించడంలేదు. ఇక మంత్రులు మా వద్ద ఎలాంటి అధికారాలు లేవని చేతులెత్తేస్తున్న పరిస్థితి.
విద్యా, ఉద్యోగ,రాజకీయ,ఆర్థిక ఉపాధి పరంగా అన్ని రంగాల్లో అన్యాయానికి గురవుతున్న ఎస్సీ ఉపకులాలకు న్యాయమైన వాటా దక్కాలంటే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి ఉపకులాల స్థితిగతులపై సమగ్ర విచారణజరిపి ఎస్సీ వర్గీకరణ చేపట్టి ఎస్సి ఉపకులాలను ఏ వర్గంలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాము. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నందున అన్యాయానికి గురవుతున్న ఉపకులాలకు న్యాయం చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నామని, మా సమస్య పరిష్కారానికి మద్దతును ఇవ్వవలసిందిగా జాతీయ ఎస్సీఎస్టీ కమిషన్ ను, పలువురు కేంద్ర పెద్దలను కలువనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిముళ్ల వెంకటేశ్ హోలియదాసరి, దివాకర్ దొంబరా, కర్నే రామారావు డక్కలి, కురువ జయరాములు మదసికురువ, రాగిషెట్టి పెంటయ్య మోచి, ముప్పాళ్ళ సుధాకర్ బైండ్లా, తులసీదాస్ గైక్వాడ్ మాంగ్, చక్రపాణి చిందు, దుర్గం శివ నెతకాని, పస్తం నరహరి బెడబుడగ జంగం, పవన్ ద్యావతి.. తదితరులు పాల్గొన్నారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews