లండన్: టీ-పీసీసీ ఎన్నారై సెల్ యూకే ఆధ్వర్యంలో లండన్ లో రాహుల్ గాంధీ జీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకి మద్దతు తెలుపుతూ, సంఘీభావం తెలుపుతూ సభ నిర్వహించారు. ప్రతి భారతీయునికి సమ న్యాయం జరగాలని చేస్తున్న కార్యక్రమంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ ఈ సందర్భంగా పిలునిచ్చారు. గత కొన్నేళ్లుగా మతం పేరుతో, కులం పేరుతో, ఆహారం పేరుతో జరుగుతున్న దాడులపై మేధావులు మౌనం వీడాలన్నారు.కో కన్వీనర్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ, భారతీయులందరిని కలుస్తూ, అందరి ఆలోచన లు వింటూ, వారి ఆలోచనలతో రాహుల్ గాంధీ ముందుకు వెళ్లే ఆలోచన అద్భుతమని కొనియాడారు.ఈ కార్యక్రమం లో ప్రవీణ్ రెడ్డి, రాకేష్, శ్రీధర్ మంగళరపు, మేరీ, నరేష్, శ్రీనివాస్ రెడ్డి, షాయబ్ ఖాన్, మధుకర్ రెడ్డి, కళ్యాణ్, తదితర 40 మంది టీపీసీసీ ఎన్నారై సెల్ కార్యకర్తలు పాల్గొన్నారు. 18వ తేదీ అధికార పర్యటనలో భాగంగా లండన్ రానున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ, ప్రవాస తెలుగు వారిని ఉద్దేశించి మాట్లాడే “హలో లండన్” కార్యక్రమం విజయవంతం చేయడానికి భారీ సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

By admin